Venkatesh1

Jan 30 2024, 15:59

జగనన్న సంక్షేమ పథకాలే.. విజయానికి సోపానాలు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

జగనన్న సంక్షేమ పథకాలే.. విజయానికి సోపానాలు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

◆ పాల్గొన్న సమన్వయకర్త యం. వీరాంజనేయులు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వైఎస్సార్సీపీ విజయానికి సోపానాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలో డా.వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్, అలాగే ఎల్లుట్ల గ్రామంలో గ్రామ సచివాలయం, డా.వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్ ల నూతన భవనాలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ...గత టిడిపి ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని, అప్పట్లో ఏవైనా పథకాలు వర్తించాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చరిత్రలో లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి అందించామన్నారు. జగనన్న పాలనను చూసి ఓటమి భయంతో ప్రతిపక్షాలు కూటములుగా వస్తున్నాయని, వాటిని తిప్పికొడుతూ రాబోయే ఎన్నికలలో జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.